నిన్న మంగళ వారం భూమన కరుణాకర రెడ్డి నేతృత్వం లోని TTD బోర్డు సమావేశం అయ్యి తీసుకున్న వాటిలో కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తున్నాయి.
వాటిలో మొదటిది తిరుపతి కార్పొరేషన్ కోసం TTD నిధుల నుండి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేయడం.
డానికి కొంతమంది చెప్తున్న లాజిక్ ఏమిటంటే తిరుపతి, తిరుమల వేరు వేరు కాదనీ, రెండూ ఒకటేనని. అక్కడ ఎంత ఖర్చు పెట్టినా కూడా అది భక్తుల కోసమే కాబట్టి TTD
డబ్బులు తిరుపతి కోసం ఖర్చు పెట్టినా పరవాలేదని వాదనలు మొదలు పెట్టారు.
ఈ లెక్కన తిరుమల లో పాటించే ప్రతీ నియమం తిరుపతి లో కూడా పాటించగలరా.?
అంటే తిరుమల లో లాగా తిరుపతి లో కూడా మద్యం, మాంసం నిషేధించగలరా.?
అసలు తిరుపతి అభివృద్ధి అనేది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. దానికి TTD కి ఏం సంబంధం. అయినా కూడా ప్రతి ఏటా కొన్ని కోట్ల రూపాయలు TTD ప్రభుత్వానికి ఇస్తూ ఉంది. అంతే కాకుండా వివిధ సంక్షేమ పథకాలు చేపడుతూనే ఉంది.
ఇంకో ఏడాది పోతే కుబేరుడు కన్నా ముందే కార్పొరేషన్ కి చెల్లింపులు చేయాల్సి రావచ్చు.