ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం పర్యాటక రంగం మీదే బ్రతుకుతున్నాయి. అలాంటి వాటిలో మాల్దీవ్ లు ఒకటి. అక్కడ ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. అందమైన బీచుల్లో సేద తీరాలి అనుకునే వాళ్ళు అందరికీ అదో స్వర్గ ధామం.
ముఖ్యంగా ప్రైవసీ కోరుకునే వాళ్ళకి అక్కడ లోటు ఉండదు.
ఎలాంటి మీడియా కూడా అక్కడ పర్మిషన్ లేకుండా సెలబ్రిటీల ఫోటోలు తీయకూడదు. అందుకే లేడీ సెలబ్రిటీలు ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీ లు అందరూ అక్కడకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అలాంటిది ఇప్పుడు అందరూ “బాయ్ కాట్ మాల్దీవ్” అనే హ్యాష్ ట్యాగ్ పట్టుకున్నారు. కారణం ఆ దేశం లో కొత్తగా ఎన్నికైన ఒక మంత్రి మన దేశంలోని లక్షద్వీప్ మీద చేసిన వ్యాఖ్యలు.
ఇటీవల మోడీ లక్షద్వీప్ సందర్శించి పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఒక చిన్న ప్రయత్నం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
కొత్తగా ఎన్నికైన మాల్దీవ్స్ ప్రభుత్వంలోని ఒక మహిళా మంత్రి “Mariyam Shiuna” ఆ పర్యటనని పరోక్షంగా ఉద్దేశించి “ఇలాంటి మురికి చోట్లకి ఎవరు వస్తారు.? ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లక్షద్వీప్ మాల్దీవ్స్ తో పోటీ పడలేదు” అని ట్వీట్ చేసింది. దాంతో ఒక్కసారిగా భారత దేశం భగ్గుమంది.
అక్షయ్ కుమార్ తో సహా టాప్ సెలేబ్రిటీలు అందరూ తాము మాల్దీవ్స్ ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటనలు చేసారు. దాంతో రియలైజ్ అయిన మాల్దీవ్స్ ప్రభుత్వం ఆ ట్వీట్ లు తొలగింప చేసి ఆ మంత్రిని సస్పెండ్ చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
దాదాపు 80వేల మంది పర్యాటకులు మాల్దీవ్స్ కి వెళ్ళాల్సిన టికెట్స్, అడ్వాన్స్ గా బుక్ చేసుకున్న పదివేల హోటల్ రూమ్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో కేవలం పర్యాటక రంగం మీదే తొంభై శాతం ఆధారపడిన ఆ దేశం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో అర్థం కాక పరిస్థితి ఎలా సరిదిద్దాలో తెలియక కొట్టిమిట్టాడుతోంది.
అద్దాల మేడ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండక పొతే అంతేమరి.