సినిమా హీరోలు తమ పారితోషికాల్లో ఏడంకెల దాటి, ఎనిమిదంకెల సంఖ్య చేరుకుని చాలా రోజులయింది. ఒక అయిదారేళ్ళ క్రితం పవన్, మహేష్ లాంటి సూపర్ స్టార్స్ లు మాత్రమే పది కోట్ల రేంజ్ లో ఉండేవాళ్ళు. బాహుబలి కి ముందు ప్రభాస్ కూడా అందుబాటులో ఉండేవాడు.
కానీ ఎప్పుడైతే బాహుబలి, పాన్ ఇండియా అనే రేంజ్ అనేవి మొదలయ్యాయో హీరోల పారితోషికాలు కూడా పదుల కోట్ల రూపాయలు దాటి వంద కోట్ల రూపాయలకి చేరుకున్నాయి.
ఇప్పటి దాకా వారిసు, తెలుగులో వారసుడు సినిమా కోసం తమిళ సూపర్ స్టార్ విజయ్ 150 కోట్ల రూపాయలు సింగిల్ పేమెంట్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఏ భాషలో చూసుకున్నా కూడా ఇదే అత్యధిక పారితోషికం. కానీ అటు దిల్ రాజు కానీ, ఇటు విజయ్ వైపు నుండి కానీ ఎవరూ ఈ వార్త నిర్ధారణ చేయలేదు.
కానీ ఇలాంటి ముసుగులో గుద్దులాటలు తనవల్ల కాదంటూ తలైవా రజనీ ఓపెన్ గా కుండ బద్దలు కొట్టినట్టు అక్షరాలా 210 కోట్ల రూపాయలు అందుకున్నారు.
మొన్న విడుదలై సూపర్ హిట్టయిన “జైలర్” కోసం పారితోషికంగా విడుదలకి ముందే సింగిల్ పేమెంట్ 110 కోట్ల రూపాయలు తీసుకోగా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టాక మళ్ళీ లాభాల్లో వాటా కింద మరో వంద కోట్ల రూపాయల చెక్కుని సినిమా నిర్మాత కళానిధి మారన్ రజనీకాంత్ కి అందిస్తూ ఫోటో దిగి రికార్డెడ్ గా భారత దేశం లో రజనీకాంత్ కి తిరుగు లేదని ఓపెన్ గా చెప్పేశారు.
మిగతా హీరోలు తమ తమ రేంజ్ ని బట్టి వందల కోట్లలో, లాభాల్లో వాటా తీసుకున్నా కూడా ఎవరూ ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పలేదు కాబట్టి ప్రస్తుతానికి రజనీకాంత్ దే ఈ అత్యధిక పారితోషికం రికార్డ్ అని చెప్పచ్చు.
అన్నట్టు ఈ సినిమా తీసింది రాబోయే లోక్ సభ ఎన్నికలలో రజనీ అభిమానుల కి గాలం వేయడం కోసం డిఎంకె వేసిన ఎత్తుగడ కాదు కదా.!